Skip to main content

Posts

Showing posts from December, 2012

చిట్టి రాయబారులు -నా తపాలా బిళ్ళల సేకరణ

నాల్గోవ ప్రపంచ తెలుగు మహా సభలు సందర్బంగా  'చిట్టి రాయబారులు'  ఆకట్టుకుంటున్న తపాలా బిళ్ళల సేకరణ  అనే శీర్షిక తో 26-12-2012 న ఈనాడు దినపత్రిక  గుంటూరు జిల్లా సంచికలో ఒక వార్తా కధనం వచ్చింది. ఈ వార్తా కధనం లో నేను 1984 నుండి సేకరించిన తపాలా బిళ్ళల గురంచి, వాటిలో తపాలాబిళ్లల పై మన తెలుగు భాష, సంస్కృతి, జాతి వెలుగులు గురించి, స్టాంప్స్ ఆఫ్ ఆంధ్ర బ్లాగు గురించిన వివరాలు ప్రచురించారు. పూర్తి వివరాలకు కింది చిత్రాన్ని క్లిక్ చేయండి. News in Eenaadu- Prof.Kodali Srinivas Link  : http://eenadu.net/district/inner.aspx?dsname=Guntur&info=gnt-panel3

ఆచార్య నాగార్జునుడు

India post Issued a Special Cover in  Decennial celebrations of  Guntur Numismatic & Philatelic Society ( GNPS )on 4- 12 -2004. The  cancellation on cover Shows the Statue of Acharya Nagarjunudu. GNPS - దశాబ్ది ఉత్సవాల సందర్బంగా విడుదల చేసిన ప్రత్యేక తపాలా కవర్ Acharya Nagarjuna (150-250 CE)  is widely considered the most important Buddhist philosopher. H e is credited with founding the  Madhyamaka  school of  Mahayana  Buddhism .   He is traditionally supposed to have written several treatises on  rasayana   alchemy  as well as serving a term as the head of  Nalanda  University. Acharya Nagarjuna Statue  is often depicted in composite form comprising human and  naga  characteristics. Often the naga aspect forms a canopy crowning and shielding his human head. The notion of the naga is found throughout Indian religious culture, and In Buddhism, it is a synonym for a wise person. ప్రత్యేక తపాలా ముద్ర -ఆచార్య నాగార్జునుడు  GNPS  దశాబ్ది ఉత్సవాల సందర్బంగా  భారత

దీప స్తంభాలు - Light Houses of India

India Post issued Two stamps and   Miniature sheet  , featuring Light Houses of India on 23 December 2012 with face value Rs 20 and Rs 5.  These stamps depicts Light House of Alleppey and Mahabalipuram.   Light House of Alleppey and Mahabalipuram భారత తపాలా శాఖ 23-12-2012 న కేరళ లో ఉన్న అలెప్పి, తమిళనాడు లో ఉన్న మహాబలి పురం  లలో గల దీప స్తంభాలు(Light Houses) ఇతివృత్తంగా అందమైన ఒక లఘు బొమ్మ (మినియెచర్) మరియు రెండు తపాలా బిళ్ళలు విడుదలచేసింది.

కాకతీయులకు గుర్తింపు ఏది?

శాతవాహనుల అనంతరం ఆంధ్రదేశాన్ని,జాతినీ సమైక్యం చేసి, ఏకచ్ఛత్రాధిత్యం క్రిందికి తెచ్చిన హైందవ రాజవంశీయులు కాకతీయులొక్కరే.  తొలుత చాళుక్యులకు తరువాత రాష్ట్రకూటులకు సామంతులుగా ఉండి, తెలుగు దేశమును ఏకము చేసి పరిపాలన సాగించిన వారు కాకతీయులు.   కాకతీయ సామ్రాజ్యము( 1083-1326 )వెల్లివిరిసిన  కాలములో తెలుగు భాష, సంస్కృతి, శిల్పము, సాహిత్యము మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాయి.   కాకతీయ వంశమునకు గొప్ప పేరు ప్రఖ్యాతులని తెచ్చిపెట్టిన వీరవనిత రాణి రుద్రమ దేవి. కాకతీయ సామ్రాజ్యం 14వ శతాబ్దపు తొలి సంవత్సరములలో తురుష్కుల దాడిని పలుమారులు ఎదిరించి చివరకు క్రీ. శ. 1323 లో రెండవ ప్రతాప రుద్రుని మరణంతో పతనమయ్యింది. ఆ తరువాత కాకతీయుల సేనానులు  ముసునూరు నాయకులు 1326 లో తిరిగి తురుష్కులను పారదోలి 1370 వరకు ఓరుగల్లును పాలించారు. ముసునూరి కాపయ నాయకుని మరణంతో  వైభవాన్ని కోల్పోయి ఈ ప్రాంతం ముస్లిం పాలకుల చేతికి వచ్చింది. తరువాత  బహుమనీ సుల్తానులు ,  గోల్కొండ  సుల్తానులు, మొఘలు పరిపాలకులు,  నిజాం  సుల్తానులు ఏలుబడిలోకి వచ్చి పోలిస్ చర్య తో భారత దేశం లో విలీనం చెందింది. గొప్ప విషయం ఏమిటంటే, ఇంతకు ముందు 

గణితమేధావి శ్రీనివాస రామానుజన్

Every  year December 22, the birthday of    Srinivasa Ramanujam is celebrated as ‘ National Mathematics Day.’    In view of this   India Post released a commemorative  postal  stamp on   on   22-12-2012. National Mathematics Day Date of  Issue :  22 December 2012  జాతీయ గణిత దినం సందర్బంగా మన భారత తపాలా శాఖ వారు 22-12-2012 న ఒక ప్రత్యేక తపాలా బిళ్ళను విడుదల చేసారు. ఈ తపాలా బిళ్ళ పై నంబర్ థియరీ తో శ్రీనివాస రామానుజం చిత్రాన్ని ముద్రించారు. Srinivasa Ramanajan - First Day Cover ఈ తపాలా బిళ్ళ నిజానికి  డిసెంబర్ 22,2011 న విడుదల కావలిసి ఉండగా దానిని అర్దాంతం గా నిలిపి మరొక ప్రత్యేక తపాలా బిళ్ళ శ్రీనివాస రామానుజం గారికి విడుదల చేసారు. ఇలా ఎందుకు చేసారో తెలియదు. బహుశ దానిపై రాముజం పేరు లేకపోవటం కారణం కావచ్చు.(తప్పు ఉంటె తమిళ సోదరులకు చిర్రెతుకొస్తుంది) కొంత మంది డీలర్లు ఈ తపాలా బిళ్ళను నిరుడే పోస్ట్ ఆఫీసు నుండి లోపాయకారిగా సేకరించి దానితో వ్యాపారం చేసారు. ఒక్కో తపాలా బిళ్ళ 1000 రూపాయల దాకా అమ్మటం జరిగింది. ఇంతక మునుపు 1994 లో బేగం అక్తర్ కు విడుదల చేసిన తపాలా బిళ్

కలియుగ భీముడు కోడి రామ్మూర్తి నాయుడు

A Special Cover On KALIYUGA  BHIMA KODI RAMAMURTHI  by India Post  on 28 -1- 1995  కోడి రామ్మూర్తి నాయుడు మన భారత తపాలా శాఖ వారు  VIZNUPEX-'95 విజయనగరం లో జరిగిన సందర్బంగా  కలియుగ భీముడు  కోడి రామ్మూర్తి నాయుడు గారికి నివాళిగా28-01-1995 న ఒక ప్రత్యేక తపాలా కవర్ విడుదల చేసారు. ఈ ప్రత్యేక కవర్ పై ఉపయోగించటానికి విజయనగరం రాజకోట తో ప్రత్యేక తపాలా ముద్రను రూపొందించారు.  కోడి రామ్మూర్తి నాయుడు  (1885 - 1942) ఆంధ్రరాష్ట్రానికి చెందిన ప్రముఖ వస్తాదు మరియు మల్లయోధులు, సర్కస్ వీరుడు. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్రలో  ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది.  ఇరవయ్యో శతాబ్దపు తొలి దశకాల్లో ప్రపంచ ఖ్యాతి గాంచిన  తెలుగువారిలో  అగ్రగణ్యులు.  వీరు  శ్రీకాకుళం   జిల్లా  వీరఘట్టంలో  జన్మించారు.  మద్రాసులో సైదాపేట కాలేజిలో ఒక సంవత్సరం వ్యాయామశాలలో శిక్షణ తీసుకుని విజయనగరానికి తిరిగి వచ్చి విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయమ శిక్షణోపాధ్యాయునిగా పని చేశారు. తరువాత ఒక సర్కస్ సంస్థను స్థాపించి తన బలప్రదర్శనతో దేశ విద

గుంటూరు జిల్లా చరిత్ర

India post Issued a Special Cover in  Centenary celebrations of  Guntur  District Formation on 1- 10 -2004. Guntur  district Formation Centenary  గుంటూరు జిల్లా అవతరణ జరిగి 100 వసంతాలు (1904 లో కృష్ణ జిల్లా నుండి విభజించబడినది) నిండిన సందర్బం గా  శతాబ్ది ఉత్సవాలు జరిపినప్పుడు మన తపాలా శాఖ 1-10-2004 న  ఒక ప్రత్యేక తపాలా కవరు విడుదల చేసారు. దానిపై గుంటూరు జిల్లా కు ప్రాశస్తాన్ని కలిగించిన చారిత్రిక చిహ్నాలను ముద్రించారు.   ప్రపంచ ప్రఖ్యాత బౌద్ధస్థూపంగల  అమరావతి , అనంతపద్మనాభస్వామి కి అంకితమివ్వబడిన గుహలు గల  ఉండవల్లి గుహలు, కొండవీటి కోట,నాగార్జున సాగర్ ఆనకట్ట ,ఎత్తిపోతల జలపాతం,ఉప్పలపాడు పక్షుల వలస కేంద్రం ,శాతవాహన చక్రవర్తి వాసిష్టి పుత్ర శ్రీ పులుమావి వినియోగించిన నాణేలు దీనిపై ఉన్నాయి. గుంటూరు పేరుతో ఖ్యతి చెందిన  గోంగూర, మిరపకాయ,పొగాకు పంటలను సూచిస్తూ  వాటి ఆకులు దీనిపై చూడవచ్చు. ఈ కవరు పై ఉపయోగించుటకు   ఈ జిల్లా స్వరూపాన్ని చూపే మ్యాపు తో ప్రత్యేక తపాలా ముద్ర ను రూపొందించారు. గుంటూరు జిల్లా చరిత్ర                  గుంటూరు జిల్లాకు అతి పురాతనమైన చరిత్ర ఉంది.  మౌర్యులు ,  శా

యూరోపు దేశపు తపాలా బిళ్ళ పై తెలుగు అక్షరం

  Telugu alphabet on EUROPA stamp   Date of Issue: 9th May 2008 ఈ ఇంటర్నెట్ యుగం లో ఉత్తరాలు రాయటం దాదాపుప్రపంచ వ్యాప్తంగా  అంతరించి పోతున్నది. ఉత్తరం రాయటం ఒక కళ. దీనివల్ల పిల్లలకు  భాషపై  పట్టును ఇస్తుంది. అవసంరం ఉన్న లేకున్నా పిల్లలలో ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించావలిసిన భాద్యత పెద్దలపై , ఉపాధ్యాయుల పై ఉంది. ఈ మంచి ఉద్దేశంతో పిల్లలలో ఉత్తరాలు రాసే అలవాటును ప్రోత్సహించటానికి యూరోపా దేశాలు 2008 లో 'లెటర్ రైటింగ్' అనే అంశం పై తపాలా బిళ్ళ లు విడుదల చేసాయి.  ఈ అంశం పై విడుదలైన తపాలా బిళ్ళ లలో యూరోపా దేశాలలో ఒకటైన  'అన్డోరా' దేశం విడుదల చేసిన తపాలా బిళ్ళ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ తపాలా బిళ్ళ ను   ప్రపంచం లో ఉన్న ప్రధాన భాషల లో గల మొదటి అక్షరం ఉండేలా రూపొందించి బడినది.  అందంగా ఉన్న ఈ  తపాల బిళ్ళ పై  అనేక ముఖ్య భాషా అక్షరాల తో పాటు మన   తెలుగు అక్షరం ' అ ' కు కుడా  స్థానం లభించింది. ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడే మన తెలుగు భాషకు సముచిత గౌరవం ఇచ్చిన   'అన్డోరా'  దేశానికి అభినందనలు. 

తపాళ బిళ్ళ పై తెలుగు అక్షారాలు

సాదారణంగా మన తపాలా బిళ్ళ ల పై హిందీ మరియు ఇంగ్లీష్ భాష లలో వాటిని గురించిన  వివరాలు ముద్రించబడి ఉంటాయి. అరుదుగా  కొన్ని సందర్బాలలో మన ప్రాంతీయ బాషలు కుడా వాటిపై  చోటుసేసు కుంటాయి. అలా మన తెలుగు అక్షరాలు మన భారత దేశ తపాల బిళ్ళల పై మూడు సార్లు చోటు చేసుకున్నాయి. తపాళ బిళ్ళ పై తెలుగు అక్షారాల వివరాలు. మొదటి సారి  16- 10 -1972 లో భారత తపాలా శాఖ విడుదల చేసిన  ఆంద్ర  కేసరి టంగుటూరి ప్రకాశం గారి స్మారక తపాలా బిళ్ళ పై ప్రకాశం పంతులు గారు   తెలుగులో పెట్టే సంతకం  'టం.ప్రకాశం' ముద్రించ బడినది. ప్రకాశం గారి సంతకం తో ఉన్న తపాలా బిళ్ళ  రెండో సారి  12-4- 1975 న  ప్రధమ ప్రపంచ తెలుగు మహా సభల సందర్బం గా విడుదలైన తపాల బిళ్ళ పై  ' దేశ   భాషల   యందు   తెలుగు   లెస్స  ' అన్న   శ్రీ   కృష్ణ   దేవరాయల   పలుకులు ,  'ఎందరో   మహానుభావులు   అందరికి   వందనములు'   అన్న   శ్రీ   త్యాగరాజ   స్వామి   కృతి   పదాలు తో   పాటు ' పనస   తొనల   కన్న , కమ్మని   తేనకన్న   తెలుగు   మిన్న'   అనే   తెలుగు మాటలు ముద్రించ బడ్డాయి. తెలుగు మహా సభల లో విడుదల చేసిన స్టా